రాజస్థాన్‌లో ఘోరం.. ఇంటిని తగలబెట్టారు... నలుగురు మృతి.. ఆరు నెలల పసికందు కూడా ..

గురువారం, 20 జులై 2023 (12:32 IST)
దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయి. రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. గుర్తు తెలియని అగంతకులు ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాలను వారి ఇంట్లోనే ఉంచి ఇల్లు మొత్తం తగలబెట్టారు. మృతుల్లో ఆరు నెలల పసికందు కూడా ఉంది. ఆ దారుణ ఘటన రాజస్థాన్‌ సీఎం అశోక్ గెహ్లాట్ సొంత జిల్లాలో చోటుచేసుకోవడంతో రాజకీయంగా తీవ్రదుమారం లేపింది. 
 
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ వర్గాలు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ దారుణ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. 
 
ఇంటి నుంచి పొగలు వస్తుండటంతో స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తుపట్టలేనంతగా కాలిపోయి నలుగురి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు