గత కొన్ని రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలోని సీసీయులో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రత్యేక వార్డుకు మార్చారు. ఇప్పటివరకు సీసీయూ విభాగంలో ఆమెకు దేశవిదేశీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్సనందించారు. ఆమె కోలుకున్నారని, ద్రవాహారం అందిస్తున్నామని, స్వయంగా శ్వాసపీల్చుకుంటూ చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపిన సంగతి తెలిసిందే.
దీంతో ఆమెను ఐసీయూ నుంచి 'ఎల్' అనే వీఐపీ వార్డుకు తరలించినట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నెలకుపైగా వెంటిలేటర్ పై ఉన్న ఆమె క్రమక్రమంగా సహజసిద్ధంగా శ్వాస పీల్చుకోగలుగుతుండటంతో, తన చుట్టూ ఏం జరుగుతుందో ఆమె అర్థం చేసుకోగలుగుతున్నారని, తనకు ఆసుపత్రి వర్గాలు అందిస్తున్న చికిత్స వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు.
మరోవైపు... తమ పార్టీ అధినేత్రి ప్రైవేట్ వార్డుకు మార్చడంతో అన్నాడీఎంకే శ్రేణులు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. తాము చేస్తున్న పూజలు, హోమాలతో తమ అమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.