పెళ్లిలో వంట మాస్టార్‌కు కరోనా... వధూవరులతో సహా అందరూ క్వారంటైన్

మంగళవారం, 23 జూన్ 2020 (08:43 IST)
వివాహ కార్యక్రమానికి విందు భోజనం ఏర్పాటు చేసిన వంట మనిషికి కరోనా సోకింది. ఈ విషయం తెలియని ఆయన ఆ వంట మనిషి.. పెళ్లి భోజనానికి కావాల్సిన అన్ని రకాల వంటలు చేశారు. ఈ వంటలను ఆరగించిన వధువరులతో పాటు.. పెళ్లికి హాజరైన కుటుంబ సభ్యులు, అతిధులు, అధికారులందరినీ క్వారంటైన్‌కు తరలించారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని తుముకూరులో జరిగింది. 
 
స్థానికుల సమాచారం మేరకు... గ్రామానికి చెందిన ఓ యువకుడి వివాహం ఇటీవల ఇంటి వద్ద నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్లిలో వంట చేసిన మాస్టర్‌(55)కు ఈ నెల 14న జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకుంటే కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
ఈ విషయం తెలిసిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొత్త జంటతోపాటు వారి కుటుంబ సభ్యులు, పెళ్లికొచ్చిన అతిథులు కలిపి మొత్తం 56 మందిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, పెళ్లి జరిగిన ప్రాంతాన్ని సీల్ చేసి రసాయనాలు స్ప్రే చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు