మలయాళ చిత్ర పరిశ్రమను డ్రగ్స్ కేసు కుదిపేస్తుంది. ఈ కేసులో మరో ఇద్దరు దర్శకులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ తీసుకున్నారనో ఆరోపణలతో ఇప్పటికే నటుడు షైన్ టామ్ చాకోను అరెస్టు చేయా, తాజాగా మరో ఇద్దరు దర్శకులను ఎక్సైజ్ శాఖ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన దర్శకుల్లో ఖలీద్ రెహ్మన్, అష్రఫ్ హంజాతో పాటు మరి స్నేహితుడు షలీఫ్ను కొచ్చిన్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. దర్శకుల అపార్టుమెంట్లో శనివారం రాత్రి ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించి, కొద్ది మొత్తంలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని దర్శకులిద్దరినీ అరెస్టు చేశారు.
దీనిపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు స్పందిస్తూ, ఆ ముగ్గురు వ్యక్తులు కొన్నేళ్ల నుంచి గంజాయి తీసుకుంటున్నారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సినిమాకు సంబంధించిన చర్చల్లో భాగంగా వారంతా ఒకే అపార్టుమెంట్లో ఉంటున్నారు. మత్తు పదార్థాలను వారికి ఎవరు సఫరా చేస్తున్నారనే విషయంపై విచారణ చేస్తున్నాం అని చెప్పారు. కాగా, మలయాళంలో ఘన విజయం సాధించిన జింఖానా చిత్రానికి ఖలీద్ రెహ్మాన్ దర్శకుడు కాగా, తమాషా చిత్రానికి అష్రఫ్ హంజా దర్శకుడు కావడం గమనార్హం.