కేరళలోని కొల్లం ఉపాసన నర్సింగ్ కాలేజీ గతవారం నుంచి మూతపడింది. కళాశాల ప్రిన్సిపాల్ తమను వేధిస్తున్నారని.. ముఖ్యంగా నిమ్న కులాల వారిపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారని.. వారిపై భారీ జరిమానాలు విధిస్తున్నారని ఆరోపించారు. అంతేగాకుండా తమపై కళాశాళ అధికారులు వివక్ష చూపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.