పెళ్లి చేసుకుంటానని సహజీవనం.. గర్భం దాల్చే సరికి పారిపోయాడు..!

బుధవారం, 23 జూన్ 2021 (18:10 IST)
పెళ్లి చేసుకుంటానని ఒక మహిళతో సహజీవనం చేసిన వ్యక్తి ఆమె గర్భం దాల్చే సరికి మాటమార్చి తప్పించుకు తిరగసాగాడు. ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దీంతో న్యాయం చేయమని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 
 
వివరాల్లోకి వెళితే.. బాలియా జిల్లాలో నివసించే 29 ఏళ్ళ యువతికి 2019లో విజయనగర్‌కు చెందిన అమిత్ మౌర్య పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ఇద్దరూ సహజీవనం చేయసాగారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి అమిత్ యువతితో సన్నిహితంగా మెలిగాడు.
 
ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. అప్పటి నుంచి మౌర్య ముఖం చాటేశాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. అంతేకాక ఒక అమ్మాయి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించి తనకు అశ్లీల చిత్రాలను పంపించేవాడని మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
 
యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమిత్ మౌర్యపై ఐపీసీ, ఐటీ చట్టంలోని సెక్షన్ 376, 506,కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు