లాక్‌‍డౌన్- పంజాబ్‌లో భర్త, భార్య గదిలో ప్రియుడు.. బెడ్ కింద దాచేసి?

శుక్రవారం, 1 మే 2020 (18:43 IST)
అత్తమామలతో కలిసి వుండే కోడలు.. లాక్ డౌన్ కావడంతో ప్రియుడిని ఇంట్లోనే దాచేసింది. భర్త సెంట్రల్ సర్వీస్ ఉద్యోగి కావడంతో రోజూ అతనితో వీడియో కాల్‌లో మాట్లాడుతూ గడిపేది. కానీ పెళ్లి జరిగి ఏడాది మాత్రమే కావడంతో పాటు.. ప్రియుడు పక్కనే వుండటంతో లాక్ డౌన్‌‌ను వేరేవిధంగా ఉపయోగించుకుంది. ఈ ఘటన బిలాజ్‌పూర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బిలాజ్ పూర్‌కు చెందిన సెంట్రల్ సర్వీస్ ఉద్యోగి లాక్ డౌన్ కారణంగా పంజాబ్‌లోనే చిక్కుకుపోయాడు. దీంతో అత్త మామలతో అతని భార్య ఇంట్లోనే ఉంటోంది. ఇంటికి కావాల్సిన సరుకులన్నీ మామగారే తెచ్చేవారు. 
 
కాని ఈ కోడలు లాక్ డౌన్‌ను తెలివిగా ఉపయోగించుకుంది. అత్తమామలతో వుంటూనే ప్రియుడిని తెలివిగా తన పడక గదిలో దాచేసింది. పది రోజుల క్రితం రాత్రి సమయంలో ప్రియుడ్ని లోపలికి తీసుకువచ్చింది. ఎవరికి అనుమానం రాకుండా అతనిని బెడ్ రూమ్‌లో ఉంచింది. ఆ గదిని ఆమె మాత్రమే వాడేది. అత్తమామలు అందులోకి వెళ్లరు. 
 
ఇదే అదనుగా, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఇంటి పని చేసుకుని, రెండు గంటలకు తన బెడ్ రూమ్‌లో నిద్రపోయేది. మళ్లీ 5 గంటలకు బయటకు వస్తోంది, ఇక రాత్రి 10 గంటలకు నిద్రపోయేది. ఈ సమయంలో తన ప్రియుడితో రొమాన్స్ చేసేది. ఇక ప్రియుడు ఆమె పడక గదిలో మంచం కింద వుండేవాడు. 
 
ఉన్నట్టుండి ఓ రోజు మామగారు బెడ్ కింద చూస్తే అతను దొరికిపోయాడు, దీంతో కోడలు చేసేది లేక నిజం ఒప్పుకుంది, ఇప్పుడు వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రియుడితో దొరికిపోయిన కోడలిని కొడుకుకు దూరంగా పెడుతామని.. అతను ఇంటికి చేరుకోగానే విడాకులు తీసుకోవాలని చెప్తామని ఆమె అత్తమామలు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు