నాలుగో దశ పోలింగ్ : జమ్మూకాశ్మీర్‌లో రికార్డు స్థాయిలో పోలింగ్

ఠాగూర్

మంగళవారం, 14 మే 2024 (09:13 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం నాలుగో దశ పోలింగ్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్‌సభ స్థానాలతో పాటు మొత్తం 96 చోట్ల పోలింగ్ జరిగింది. అయితే, ఈ దశలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కూడా పోలింగ్ జరిగింది. ఇక్కడ 1996 సంవత్సరం తర్వాత రికార్డు స్థాయిలో పోలింగ్ జరగడం గమనార్హం. గత ఎన్నికల్లో ఇకక్డ కేవలం 14.1 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. ఈ సారి మాత్రం 36 శాతం నమోదు కావడం గమనార్హం. 1996లో 41 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఇపుడే భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. మరోవైపు, దేశ వ్యాప్తంగా 63 శాతం పోలింగ్ జరిగినట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 
 
మే 13వ తేదీన ఎన్నికలు జరిగిన లోక్‌సభ స్థానాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణాలో 17, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్‌లో 13, వెస్ట్ బెంగాల్‌లో 8, జమ్మూకాశ్మీర్‌లో 1 చొప్పున ఎన్నికలు జరిగాయి. 
 
ఇంట్లో భర్త శవం ఉన్నా... బాధను దిగమింగుకుని వెళ్లి ఓటు వేసిన భార్య 
 
ప్రజాస్వామ్య దేశంలో పలువురు ఓటు హక్కును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఓటు వేసి తీరుతారు. అందరికీ స్ఫూర్తిదాకయంగా నిలుస్తారు. అలా ఓ మహిళ నిలిచారు. అనారోగ్యంతో చనిపోయిన భర్త శవాన్ని ఇంట్లో ఉన్నప్పటికీ బాధ్యత మరవకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ ఘటన బాపట్ల జిల్లా కారంచేడులో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన గర్నెపూడి చిట్టెమ్మ భర్త సింగయ్య (62) పోలింగ్ రోజైన మే 13 సోమవారం తేదీన అనారోగ్యంతో చనిపోయాడు. 
 
అయినప్పటికీ భర్త శవం ఇంట్లో ఉన్నప్పటికీ ఆమె పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. 178 పోలింగ్ కేంద్రంలో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తద్వారా ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఉన్న విలువను ఇతరులకు చాటిచెప్పారు. కాగా, గ్రామంలో చిట్టెమ్మ వీఏవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఓటుపై అవగాహన ఉన్న ఆమె ఎంతో బాధలోనూ ఓటు వేయడం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. దీంతో గ్రామస్థులంతా ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు