కాగా, మంత్రి విజయ్ షా మాట్లాడుతూ, వాళ్లు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిసేసి వితంతువుల్ని చేశారు. వాళ్ళ (ఉగ్రవాదులు) మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోడీజీ పాకిస్థాన్కు పంపించ పాఠం నేర్పించారు' అంటూ కామెంట్స్ చేశారు.
ఈ వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదంగా మారాయి. ఆయన మంత్రి పదవిపై వెంటనే వేటు వేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటుగా, కించపరిచేవిగా ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్జే అన్నారు. మరోవైపు, మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధిష్టానం కూడా మంత్రిని పిలిచి చీవాట్లు పెట్టింది.