శశికళ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయాలని కోరుతూ అన్నాడీఎంకే ప్రిసైడింగ్ ఛైర్మన్ మధుసూదన్ దాఖలు చేసిన పిటిషన్తో పాటు, శశికళ పుష్పా పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చాయి. ఈ మేరకు జస్టిస్ కల్యాణ సుందరం నేతృత్వంలోని ధర్మాసనం పైవిధంగా తీర్పు వెలువరించింది.
పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయాలంటే కనీసం ఐదేళ్ల పాటు పార్టీ సభ్యులుగా ఉండాలని, శశికళ పార్టీ సభ్యురాలు కాదని శశికళ పుష్పా తరపు న్యాయవాది వాదించారు. అందువల్ల పార్టీ ఉన్నత పదవికి ఆమె అర్హురాలు కాదంటూ భర్త లింగేశ్వర తిలగన్తో కలిసి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనికి ప్రతిగా పార్టీ ప్రిసైడింగ్ ఛైర్మన్ మధుసూదన్ మరో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ సభ్యురాలు కాని పుష్పకు పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేదని, ఆమె పిటిషన్ను తిరస్కరించాలని కోరుతూ ఆయన మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన అనంతరం న్యాయస్థానం శశికళ పుష్ప పిటిషన్ను కొట్టివేసింది.