కుమార్తె భర్తపై కన్నేసిన తల్లి.. కాపురాన్ని కూల్చేసింది..

ఆదివారం, 22 మార్చి 2020 (12:56 IST)
కుమార్తె భర్తపై కన్నేసిన ఆ తల్లి.. కాపురాన్ని కూల్చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే... నాందేడ్‌లోని అనిత, తన భర్త నవీన్ కుమార్‌తో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో వారి ఇంటికి తరచూ తన తల్లి సావిత్రి తరచూ వస్తుండేది. అయితే ఈ క్రమంలో అల్లుడు నవీన్ కుమార్ తో కలిసి సావిత్రి కాస్త చనువుగా ఉండేది.
 
కాగా అనిత ఇంట్లో లేని సమయంలో సైతం సావిత్రి వచ్చి అల్లుడు నవీన్‌తో కలవడం ప్రారంభమైంది. ఇలా కొంత కాలం గడిచిన తర్వాత సావిత్రి అసలు స్వరూపం బయట పడింది. కూతురు భర్త అనే సంబంధం లేకుండానే బరి తెగించి సావిత్రి అల్లుడితో శారీరక సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ కలిసి అనిత ఇంట్లో లేసి సమయంలో శృంగారంలో మునిగి తేలేవారు. 
 
ఈ విషయం అనితకు అనుమానం రాకుండా జాగ్రత్తపడేవారు. కానీ ఒక రోజు అర్థరాత్రి తన తల్లి భర్త నవీన్‌తో శృంగారం చేస్తుండగా, అనిత కళ్లల్లో పడింది. దీంతో షాక్‌కు గురైన అనిత, తన తల్లిని నిలదీసింది. ఏం చేయాలో అర్థం కాని సావిత్రి, తప్పు జరిగిపోయిందని ముందు ముందు ఇలా జరగదని, సముదాయించి బయట ఎవరికీ చెప్పవద్దని వేడుకొంది. 
 
అందుకు అనిత మళ్లీ ఇంట్లో కనపడవద్దని హెచ్చరించి బయటకు పంపేసింది. అయినా తల్లికి భర్తకు మధ్య అక్రమ సంబంధానికి తెరపడలేదు. దీంతో కన్నతల్లే కట్టుకున్న భర్తతో ఇలా చేయడంతో అనిత తీవ్ర కలతకు లోనై ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు