ఇదే అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఒక గుర్తు తెలియనివ్యక్తి తాను 13 ప్రాంతాల్లో మృతదేహాలను పాతిపెట్టినట్టు ఫిర్యాదు చేశాడు. అతని వాంగ్మూలం ఆధారంగా సిట్ బృందాలు ఆ ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టాయి ఆరో ప్రదేశంలో ఒక పురుషుడి అస్థిపంజరం లభించింది. దీంతో పాటు మరో కొత్త ప్రదేశంలోనూ కొన్ని ఎముకలు లభ్యమయ్యాయి. లభ్యమైన అన్ని అవశేషాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపాం అని ఆయన వివరించారు. 13వ స్థానంలో మాత్రం ఇంకా ఏమీ లభించలేదన్నారు.
ఫిర్యాదుదారుడు మేజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇస్తూ తాను వందల సంఖ్యలో మృతదేహాలను పాతిపెట్టినట్టు చెప్పడంతో ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి సిట్ ఏర్పాటు చేసిందని పరమేశ్వర వెల్లడించారు. దర్యాప్తులో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని, శాస్త్రీయంగా, సాంకేతిక పరిజ్ఞానంతో నిజానిజాలను నిగ్గు తేల్చాలని సిట్కు పూర్తి స్వేచ్ఛనిచ్చామని ఆయన వెల్లడించారు.