తండ్రి, కూతుళ్లిద్దరూ పెరుగును కలుపుకొని భోజనం చేశారు. తినే సమయంలో పెరుగులో నల్లరంగుల్లో ఉన్న జలగల తోలు కనిపించింది. ప్యాకెట్ను పూర్తిగా తెరచి చూడగా, మరికొన్ని పురుగులు చచ్చిపడివున్నాయి. ఇంతలో ఇరువురూ వాంతులు చేసుకోవడంతో స్పృహ కోల్పోయి.. కింద పడిపోయారు. దీన్ని గమనించి స్థానికులు, బంధువులు.. వెంటనే స్థానిక క్రోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆహార భద్రత అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.