టోల్‌ప్లాజా గార్డును కొట్టి చంపేశారు... ఎందుకో తెలుసా?

మంగళవారం, 20 జూన్ 2023 (12:21 IST)
బీహార్ రాష్ట్రంలో ఓ టోల్‌ప్లాజా సెక్యూరిటీ గార్డుపై మూక దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ గార్డు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇపుడు ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో సెక్యూరిటీ గార్డుపై కొందరు చేస్తున్న దాడి దృశ్యాలను చూస్తే గుండెతరుక్కుపోతుంది. 
 
కేవలం యాభై రూపాయలు దొంగతన చేశాడన్న ఆరోపణలపై ఆ గార్డును చావబాదారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఈ ఘటన భోజ్‌పూర్ జిల్లాలోని అర్రా - పాట్నా రహదారిపై కుల్హదియా టోల్‌ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ మూక దాడిలో ప్రాణాలు కోల్పోయిన గార్డును ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోండా జిల్లాకు చెందిన బల్వంత్ సింగ్‌గా గుర్తించారు. 
 
టోల్‌ప్లాజాలో దొంగతనానికి పాల్పడ్డారన్న అనుమానంతో నలుగురైదుగురు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బల్వంత్ సింగ్‌ను ఇతర సిబ్బంది సొంతూరుకు పంపించారు. ఈ దాడి ఘటనపై గోండా ఎస్పీ ఆకాశ్ తోమర్ స్పందిస్తూ, దాడి తర్వాత టోల్ ప్లాజ్ సిబ్బంది బాధితుడిని రైలులో సొంతూరికి పంపించినట్టు చెప్పారు. రైలులో ఆరోగ్యం బాగా క్షీణించడంతో గోండా జిల్లాలోని మన్కాపూర్ స్టేషన్‌లో దింపేసిన రైల్వే పోలీసులు అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. 
 
పరిపూర్ణానంద స్వామీజీ అరెస్టు 
 
రాజమండ్రికి చెందిన అనాథ బాలికపై గత యేడాదిగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చిన విశాఖలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చిన్న వయసులోనే బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో బాలికను చేరదీసిన బంధువులు ఐదో తరగతి వరకు చదివించారు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం విశాఖలోని కొత్త వెంకోజీ పాళెంలో ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో చేర్పించారు. 
 
అక్కడ ఆ బాలికతో స్వామీజీ ఆవులకు మేత వేయించడం, పేడ తీయడం వంటిపనులు చేయిస్తూ వచ్చారు. రాత్రి సమయంలో తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఇలా ఒక యేడాది కాలంగా ఆ బాలికను తన గదిలోనే గొలుసుతో బంధించాడు. ఎదురు తిరిగితే కొట్టేవాడు. రెండు చెంచాల భోజనం మాత్రమే పెట్టి కాలకృత్యాలకు కూడా అనుమతించకపోయేవానరని వారానికి ఒకసారి మాత్రమే స్నానానికి వెళ్లనిచ్చేవారన బాధిత బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఈ క్రమంలో ఈ నెల 13వతేదీన పన మనిషి సాయంతో ఆ బాలిక ఆశ్రమ నుంచి బయటపడింది. రైల్వే స్టేషన్‌కు చేరుకుని తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎక్కంది. అక్కడ తనకు పరిచయమైన ఓ ప్రయాణికురాలితో తన బాధను చెప్పుకుంది. ఆ మహిళ తనతో పాటు తీసుకెళ్లి రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా కంకిపాడులోని ఓ హాస్టల్‌లో చేర్పించేందుకు ప్రయత్నిచంగా, హాస్టల్ నిర్వాహకులు మాత్రం పోలీసుల నుంచి అనుమతి లేఖ తెస్తేనే చేర్చుకుంటామని చెప్పారు. దీంతో ఆ బాలికను వెంట బెట్టుకుని బాలల సంక్షేమ కమిటీకి వెళ్ళి తనకు జరిగిన విషయాన్ని వివరించింది. 
 
దీంతో నిర్ఘాంతపోయిన కమీటీ సభ్యులు.. విజయవాడలోని దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు స్వామీజీపై పోక్సో చట్టంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సోమవారం రాత్రి అరెస్టు చేశారు. అయితే, ఆ బాలిక చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని అంతా అబద్ధమేనని స్వామీజీ కొట్టిపారేసారు. ఆశ్రమ భూములను కొందరు కొట్టేయాలని చూస్తున్నారని, అందులోభాగంగానే తనపై కుట్ర జరిగిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. కాగా, ఆశ్రమం నుంచి బాలిక అదృశ్యమైనట్టు ఈ నెల 15వ తేదీన ఆశ్రమ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు