హనీమూన్ మర్డర్ కేసు : సోనమ్‌ను పట్టించిన మంగళసూత్రం - ఉంగరం

ఠాగూర్

శుక్రవారం, 13 జూన్ 2025 (11:49 IST)
మేఘాలయ హనీమూన్ హత్య కేసు దర్యాప్తులో అనేక కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మేఘాలయకు వెళ్లిన తర్వాత రాజా రఘువంశీ (29), సోనమ్ రఘువంశీ (25)లు బస చేసిన హోటల్‌లో మంగళసూత్రం, ఉంగరం లభించాయని, ఇవే ఆ తర్వాత దర్యాప్తులో నిందితురాలిని పట్టించాయని పోలీసులు తెలిపారు. 
 
"కొత్తగా పెళ్లి అయిన మహిళ గదిలోనే మంగసూత్రాన్ని ఉంగరాన్ని పెట్టి వెళ్లడం మాకు కొత్త అనుమానాలకు కలిగించింది. ఈ కోణంలోనే దర్యాప్తును ముమ్మరం చేశారు. అపుడే నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరాన్ని అగీకరించారు" అని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. 
 
మరోవైపు, తన భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనమ్ మే 23వ జితేంద్ర రఘువంశీ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా నుంచి కిరాయి హంతకులకు చెల్లింపులు చేసినట్టు పోలీసులు గుర్తించారు. తమ కుటుంబ వ్యాపారంలో జూనియర్ ఉద్యోగిగా పనిచేస్తున్న జితేంద్ర రఘువంశీ పేరుతో ఆమె యూపీఏ ఖాతాను తెరిచినట్టు సోనమ్ సోదరుడు గోవింద్ రఘువంశీ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు