సినీ నటి జయప్రదకు జైలుశిక్షను ఖరారు చేసిన మద్రాస్ హైకోర్టు

శుక్రవారం, 20 అక్టోబరు 2023 (13:46 IST)
సినీ నటి జయప్రదకు మద్రాసు హైకోర్టు జైలుశిక్షను ఖరారు చేసింది. సినిమా థియేటర్ సిబ్బంది నుంచి వసూలు చేసిన ఈఎస్ఐ మొత్తానికి వడ్డీ చెల్లించని కేసులో ఆమెకు చెన్నై ఎగ్మోర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ గతంలో తీర్పునిచ్చింది. ఈ తీర్పును నిలిపివేయాలని కోరుతూ ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఆమె కోరికను తిరస్కరించి, జైలుశిక్షను ఖరారు చేసింది. 
 
పైగా 15 రోజుల్లో ఆమె లొంగిపోవాలని సూచన చేసింది. అదేసమయంలో కింది కోర్టులో ఆమె స్వయంగా హాజరై రూ.20 లక్షలు డిపాజిట్ చేసి బెయిల్ పొందవచ్చన్న సండలింపు ఇచ్చింది. అంతేకాకుండా, రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. మరోవైపు జైలుశిక్ష రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. 
 
కాగా, జయప్రదకు చెన్నైలోని రాయపేటలో జయప్రద, రాజ్ అనే రెండు థియేటర్లు ఉండేవి. వీటిని ఆమె సోదరులు పర్యవేక్షిస్తూ వచ్చారు. ఈ థియేటర్లలో పని చేసే సిబ్బంది నుంచి ఈఎస్ఐ కోసం వసూలు చేసిన మొత్తానికి థియేటర్ యాజమాన్యం వడ్డీని పీఎఫ్ కార్యాలయంలో జమ చేయలేదు. ఇదేవిషయంపై సిబ్బంది కోర్టును ఆశ్రయించగా, జయప్రదకు షాక్ ఇచ్చింది. దీంతో ఆమెకు కోర్టు చిక్కులు ఎదురయ్యాయి. కాగా, ప్రస్తుతం ఆ రెండు సినిమా థియేటర్లు మూసివున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు