కర్ణాటక ఎన్నికలు.. గాలి కుటుంబానికి చుక్కెదురు.. ఆయనొక్కడే విన్

శనివారం, 13 మే 2023 (17:08 IST)
మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కుటుంబానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చుక్కలు కనిపించాయి. ఈ ఎన్నికల్లో గాలి కుటుంబం ప్రాభవాన్ని కోల్పోయింది. కుటుంబం నుంచి నలుగురు పోటీ చేస్తే కేవలం గాలి జనార్దన్ రెడ్డి మాత్రమే గెలుపొందారు. 
 
కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ తరపున పోటీ చేసిన గాలి.. గంగావతి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈ పార్టీ తరపున 15మంది బరిలోకి దిగారు. 
 
బళ్లారి పట్టణ నియోజకర్గం నుంచి బరిలోకి దిగిన జనార్దన్ రెడ్డి భార్య లక్ష్మి ఓటమిపాలయ్యారు. గాలి కుటుంబానికి కంచుకోటగా ఉన్న బళ్లారిలో కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి గెలుపొందారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు