ఏపీని నాశనం చేస్తున్న జగన్.. ప్రభుత్వ టెర్రరిజం : మోహన్‌దాస్ పాయ్

శుక్రవారం, 16 ఆగస్టు 2019 (17:06 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రముఖ పరిశ్రామికవేత్త మోహన్‌దాస్ పాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం కొనసాగుతోందంటూ మండిపడ్డారు. కర్ణాటక రాష్ట్రంలో పాయ్ ఓ బడాపారిశ్రామికవేత్తగా ఉన్నారు. 
 
ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పీపీఏలపై సమీక్షలు నిర్వహించాలని, రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. దీనిపై మోహన్ దాస్ పాయ్ ఘాటైన వ్యాఖ్యలతో తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసి, దాన్ని నేరుగా జగన్‌కు ట్యాగ్ చేశారు. 
 
ఏపీలో ప్రభుత్వం ట్రెరిరిజం కొనసాగుతోందని మండిపడ్డారు. పీపీఏల సమీక్ష రాష్ట్ర భవిష్య‌కు మంచిదికాదన్నారు. ఇలా చేస్తే రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయంటూ ఆయన ప్రశ్నించారు. జపాన్ పరిశ్రమ కంపెనీలు లేఖలు రాసిన తర్వాత అయినా కళ్లు తెరుచుకోవద్దా అంటూ ప్రశ్నించారు. 
 
కర్ణాటక రాష్ట్రంలోని పలు కంపెనీల్లో ఆయన ఇండిపెండెంట్ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రభుత్వం నిర్ణయాల వల్ల ఒక్క పరిశ్రమా రాదన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఏపీ భవిష్యత్‌ను నాశనం చేయవద్దని ఆయన హితవు పలికారు. ఇదే విషయంపై జగన్‌కు జూన్ నెలాఖరులో ఓ లేఖ రాశారు కూడా. 
 
ఈయన అక్షయపాత్ర సహ వ్యవస్థాపకులు కావడం గమనార్హం. ఇండస్ట్రీని దెబ్బతీసి పరిశ్రమలు రాకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీ భవిష్యత్‌ను జగన్ నాశనం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు