కుమార్తెతో సంబంధం.. యువకుడిని చిత్ర హింసలు పెట్టిన తండ్రి.. ఎక్కడ?

బుధవారం, 27 జనవరి 2021 (12:42 IST)
మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో దారుణం జరిగింది. తన కుమార్తెతో సంబంధాన్ని కలిగి ఉన్నాడన్న అక్కసుతో యువతి తండ్రి దారుణానికి ఒడిగట్టారు. యువకుడి మర్మాంగాలపై దాడిచేసి చిత్రహింసలకు గురి చేశారు. 
 
వివరాల్లోకి వెళ్తే ముంబైలో ఓ యువతితో 18 ఏళ్ల ఓవైస్ అబ్దుల్ రహీం ఖాన్ అనే యువకుడు సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే తన కుమార్తెకు దూరంగా ఉండాలని తండ్రి పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆ యువకుడు మాత్రం ఆ యువతిని వదల్లేదు. దీంతో యువతి తండ్రి 30 మందితో కలిసి యువకుడిపై దాడికి పాల్పడ్డాడు.
 
యువకుడి రహస్య భాగాలపై కత్తి, రాడ్‌లతో దాడి చేశాడు. ఆ తర్వాత కొండపై నుంచి నెట్టివేశారు. ఆ తర్వాత కోలుకున్న ఓవైస్ అబ్దుల్ రహీం ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. జనవరి 23న జరిగిన ఈ ఘటన తర్వాత ప్రాణాలతో బయటపడినట్లు చెప్పుకొచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి తండ్రే ఈ కేసులో ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. 
 
తన కుమార్తెతో కలిసి ఉండకూడదని.. సంబంధం కొనసాగించొద్దని ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ యువకుడు పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. అందువల్లే దాడి జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 30మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు