దోషి అని తేలితే ఉరి తీయండి.. సోనమ్ సోదరుడు

ఠాగూర్

బుధవారం, 11 జూన్ 2025 (18:53 IST)
మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై సోదరుడు గోవింద్ రఘువంశీ స్పందించారు. ఆయన బుధవారం మృతుడు రాజా రఘువంశీ తల్లితో పాటు కుటుంబ సభ్యులను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా సోనమ్‌తో అన్న సంబంధాలు తెంచుకుందని ప్రకటించారు. ఒకవేళ సోనమ్ దోషి అని తేలితే ఉరితీయాలని సోదరుడు గోవిద్ రఘువంశీ డిమాండ్ చేశారు. 
 
బుధవారం ఇండోర్‌లోని రాజా రఘువంశీ నివాసానికి వెళ్లిన గోవింద్, రాజా తల్లి ఉమా రఘువంశీని ఆలింగనం చేసుకుని బోరున విలపించారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని కలిచివేశాయి. మే 11వ తేదీన వివాహం చేసుకున్న సోనమ్ (24), రాజా (29) నవ దంపతులు హనీమూన్‌కి వెళ్లగా పెళ్లయిన 12 రోజులకే మే 23వ తేదీన రాజా హత్యకు గురయ్యారు. 21 యేళ్ల రాజ్ కుశ్వాహాతో సోనమ్ ప్రేమ వ్యవహరం ఉందని, అతడి స్నేహితుల సహాయంతో ఈ హత్యకు కుట్ర పన్నా రని పోలీసులు విచారణలో వెల్లడైంది. సోనమ్ ఇప్పటికే నేరం అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఆ తర్వాత రాజా సోదరుడు విపిన్‌తో కలిసి ప్రతినిదులతో మాట్లాడిన గోవింద్... "సోనమ్ ఈ హత్య వెనుక ఉందని ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. కానీ, బయటకు వస్తున్న సాక్ష్యధారాలు చూస్తుంటే, ఆమెనే ఈ దారుణం చేయించిందనిపిస్తోంది. ఈ కేసులో వినిపిస్తున్న మిగతా నిందితుల పేర్లన్నీ రాజ్ కుష్వాహాకు సంబంధించినవే" అని తెలిపారు. 

 

VIDEO | Indore: Sonam Raghuvanshi's brother meets Raja Raghuvanshi's mother.#rajaraghuvanshi pic.twitter.com/KCXJkCKvAI

— Press Trust of India (@PTI_News) June 11, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు