ఈ దేశంలో అతిపెద్ద రేపిస్ట్ నెహ్రూనే : సాధ్వి ప్రాచీ

సోమవారం, 9 డిశెంబరు 2019 (10:08 IST)
దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళలకు రక్షణ కల్పించే నిమిత్తం ఎన్నో రకాలైన కఠిన చట్టాలు, చర్యలు తీసుకుంటున్నప్పటికీ... అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఫలితంగా అత్యాచారాలకు భారత్ కేంద్రంగా మారిందనే అపవాదు ప్రచారంలో ఉంది. 
 
ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్‌కు చెందిన సాధ్వి ప్రాచీ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూనే అతిపెద్ద రేపిస్ట్ అని అన్నారు. రాముడు, కృష్ణుడు సంస్కృతులను ఆయనే ధ్వంసం చేశారంటూ మండిపడ్డారు..
 
ఈ దేశానికి ఉగ్రవాదం, నక్సలిజం, అవినీతి, లైంగిక దాడి నెహ్రూ కుటుంబ సభ్యులు ఇచ్చిన బహుమతులు అని ఎద్దేవా చేశారు. ప్రపంచంలోనే లైంగిక దాడులకు రాజధానిగా భారత్ మారిందన్న రాహుల్ వ్యాఖ్యలకు స్పందించిన సాధ్వి ప్రాచీ ఆదివారం పై విధంగా స్పందించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు