పెళ్లి తర్వాత మతం మారదు : తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

శుక్రవారం, 8 డిశెంబరు 2017 (11:38 IST)
మతాంతర వివాహం చేసుకున్న మహిళకు పెళ్లి తర్వాత ఆమె మతం మారదనీ సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అంటే వివాహం తర్వాత భర్త మతమే ఆమెకు వర్తిస్తుందని తెలిపే చట్టాలేమీలేవని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
 
ఇతర మతానికి చెందిన వ్యక్తిని.. గూల్రోఖ్‌ ఎం.గుప్తా అనే పార్శీ మహిళ వివాహం చేసుకుంటే ఆమె మతాన్ని కోల్పోతుందా? అన్న అంశంపై దాఖలైన పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనం విచారణకు స్వీకరించి కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకున్న పార్శీ మహిళ తన మతాన్ని కోల్పోయి, భర్త మత విశ్వాసాలకు చెందిన వ్యక్తి అవుతుందని 2010లో గుజరాత్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గుప్తా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు