అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం. దూకుడు పెంచిన పన్నీర్ సెల్వం మౌన దీక్షను వీడి.. శశికళకు చుక్కలు చూపిస్తున్నారు. సీఎం పదవిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారు. ఎమ్మెల్యేలను బందీలుగా చేసిన శశికళపై ఇప్పటికే సవాలు విసిరిన పన్నీర్ సెల్వం.. ఎమ్మెల్యేలను ఎక్కడున్నా పట్టుకురావాలని డీజీపీ రాజేంద్రన్కు ఆదేశాలు జారీచేశారు.
మరోవైపు పన్నీర్ సెల్వంపై శశికళ సంచలన ఆరోపణలు చేశారు. పన్నీర్ సెల్వం మా ఎమ్మెల్యేలను కొంటున్నారని చెప్పారు. కాగా.. తమిళనాడులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపరిస్థితి దాగుడుమూతలు ఆడుతున్నట్లుంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తన శిబిరంలోని 130 మంది ఎమ్మెల్యేలను ఎవ్వరూ ప్రలోభ పెట్టకుండా జాగ్రత్తగా దాచేసిన సంగతి తెలిసిందే.
బీచ్ల్లో వాటర్ స్కీయింగ్లతో పాటు చక్కగా మసాజ్లు చేయించుకుంటూ లగ్జరీ రిసార్టుల్లో గడుపుతున్నట్లు సమాచారం. ఈస్ట్కోస్ట్ రోడ్లోని రిసార్ట్లో కొందరు ఉన్నారని, ఓ ఎమ్మెల్యే ఫాంహౌస్లో ఉన్నారని రకరకాలుగా చెప్తున్నారు. చెన్నైకి 80కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురం సమీపంలోని రిసార్ట్లో కొందరు శాసనసభ్యులు ఉన్నట్లు ఓ జాతీయ మీడియా గుర్తించింది.