ఆమ్‌స్ట్రాంగ్ దారుణ హత్య- పా.రంజిత్ భావోద్వేగం.. షాక్ నుంచి తేరుకోని చెన్నై (video)

వరుణ్

ఆదివారం, 7 జులై 2024 (13:32 IST)
Pa Ranjith
బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత ఆమ్‌స్ట్రాంగ్ దారుణ హత్యపై దోషులను అరెస్ట్ చేయాలని మద్దతు దారులు డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు సర్కారుపై తమకు నమ్మకం లేదని.. హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమ్‌స్ట్రాంగ్ మద్దతు దారులు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇంకా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా రాజీనామా చేయాలని కోరారు.  ఇక ఆర్మ్‌స్ట్రాంగ్‌ను శుక్రవారం చెన్నై, పెరంబూరులోని అతని నివాసానికి సమీపంలో ఆరుమందితో కూడిన గుర్తు తెలియని గుంపు గొడ్డలితో నరికి చంపేసింది.

ఈ నేపథ్యంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు హత్యపై దర్యాప్తుకు చెన్నై పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌కు సన్నిహితుడు దర్శకుడు పా. రంజిత్ కన్నీళ్లు పెట్టుకోవడంతో జరిగిన భావోద్వేగ సన్నివేశం వీడియోలో బంధించబడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
 
ఇదిలా ఉండగా, రాజకీయనాయకుడిగా మారిన నటుడు విజయ్ కూడా ఆర్మ్‌స్ట్రాంగ్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దారుణమైన నేరాలు జరగకుండా తమిళనాడు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పౌరులందరి భద్రత, భద్రతకు భరోసానిస్తూ ప్రభుత్వం శాంతిభద్రతలను రాజీపడకుండా నిర్వహించాల్సిన అవసరాన్ని విజయ్ నొక్కిచెప్పారు.

தனது மனைவியுடன் வந்து அழுதபடி ஆம்ஸ்ட்ராங் உடலுக்கு அஞ்சலி செலுத்திய பா.ரஞ்சித்..!#Chennai | #Perambur | #BahujanSamajParty | #ArmStrong | #Death | #Mayawati | #ArmStrongDeath | #Police | #ChennaiPolice | #PaRanjith | #PolimerNews pic.twitter.com/ESy8MKJ2WG

— Polimer News (@polimernews) July 7, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు