ఇకపై పాకిస్థాన్ పౌరులకు వీసాలు మంజూరు చేయబోవడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇప్పటికే వీసాలు పొందినవారు కూడా ఇండియాలో ఉండడానికి వీలులేదని ఆదేశించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యవసరంగా నిర్వహించిన భద్రతాపై కేబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక, సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
ఇంకా న్యూఢిల్లీలో ఉన్న పాకిస్థాన్ హైకమిషనర్కు కూడా తక్షణమే దేశం విడిచి వెళ్లాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అన్ని నిర్ణయాలపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఘటన పట్ల కేంద్రం తీవ్రంగా స్పందించిందని, దేశ భద్రత విషయంలో ఎలాంటి సడలింపు ఉండదని తేల్చేశారు.
సింధు జల ఒప్పందాన్ని నిలుపుదల చేశారు
పాకిస్తానీ జాతీయులకు సార్క్ వీసాలు లేవు
పాకిస్తానీతో ఉన్న అటారీ సరిహద్దు మూసివేయబడుతుంది
పాకిస్తానీలోని తన హైకమిషన్ నుండి సిబ్బందిని ఉపసంహరించుకునే భారతదేశం
పాకిస్తాన్ జాతీయుల ప్రస్తుత వీసాలను రద్దు చేయడం,