గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి, ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీకి బాడిగార్డుగా పనిచేసి.. ప్రస్తుతం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్లో డ్రైవర్గా పనిచేస్తున్న సోమశేఖర్ (33) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమశేఖర్ చిత్తూరు జిల్లాకు చెందిన కొర్లమిట్టకు చెందినవారు కావడం గమనార్హం. సోమశేఖర్ ఆత్మహత్య గల కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. సోమశేఖర్ మృత దేహాన్ని ఢిల్లీ నుంచి కొర్లమిట్టకు తరలించడంతో.. ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.
న్యూఢిల్లీలోని తన క్వార్టర్స్లో సోమశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1999లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో చేరిన సోమశేఖర్ తన ప్రతిభతో ప్రమోషన్లు తెచ్చుకుని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్లో పనిచేశారు. సోమశేఖర్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా కుటుంబ కలహాల కారణంగా సోమశేఖర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి.