ఈ భేటీకి హాజరైన దళాధిపతులతో పాటు జాతీయ భద్రతా సలహాదారుడు మనసులోని ఆలోచన ఒకటే. మరో సర్జికల్స్ స్ట్రయిక్స్ చేయాలన్న ఆలోచనలో ఉన్న మోడీ, అందుకు సలహా, సూచనలు అడుగుతారని భావించారు. లేకుంటే పాకిస్థాన్కు సంబంధించిన మరో విషయాన్ని చర్చించేందుకు పిలిచారని అనుకున్నారు.
కానీ, వాళ్ళకు ప్రధాని చెప్పిన విషయం ఒక్కటే. "నేటి రాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నాం. శాంతిభద్రతల సమస్య తలెత్తితే దాన్ని నివారించేందుకు మీ సహకారం తప్పనిసరి. అందుకే ఈ సమావేశం. ఇక మీ సలహాలివ్వండి" అని అడిగారట. ఆపై పావుగంటకు సదరు మీటింగ్ అయిపోవడం, ఆపై మోడీ మీడియా సమావేశం గురించి పత్రికలు, ప్రసార మాధ్యమాలకు సమాచారం వెళ్లడం జరిగింది.