నగరంలో హత్యలు, చైన్స్నాచింగ్ తదితరాలను నిరోధించేందుకు పోలీసు శాఖ పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వ్యభిచారాన్ని కూడా అడ్డుకొనే దిశగా వ్యభిచార నిరోధక శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యభిచార గృహాలపై దాడిచేసి బ్రోకర్లతో పాటు యువతులను అదుపులోకి తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఆ శాఖ ఇన్స్పెక్టర్ బుల్లెట్ రాజేశ్వరి, శంకర నారాయణన్ నేతృత్వంలో మంగళవారం రాత్రి ఓ ప్రముఖ హోటల్లోనూ, ఎంఆర్సీ నగర్లోని ఓ ప్రముఖ వ్యక్తి ఇంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో నలుగురు యువతులు సహా దిలీప్సింగ్, ఫైజల్ అనే బ్రోకర్లను అదుపులోకి తీసుకుని విచారించడంతో పలు విషయాలు వెలుగుచూశాయి.
ముంబై, కోల్కతా తదితర నగరాలకు చెందిన యువతులకు నెలకు రూ.7 లక్షల రూపాయలు ఇస్తామని బ్రోకర్లు చెప్పారు. వారిని విమానం ద్వారా నగరానికి రప్పిస్తున్నారు. అనంతరం వారిని తిరిగి విమానం ద్వారా వారిని పంపుతున్నట్లు విచారణలో తేలింది. వీరు ఆన్లైన్ ద్వారా విటులను ఆకర్షిస్తున్నట్లు, యువతులను కారులో పంపడం లేదా హోటళ్లల్లో వ్యభిచారం సాగిస్తున్నట్లు తేలింది. వ్యభిచారాన్ని అరికట్టేలా తనిఖీలను ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.