నాకు దక్కనిది మరొకరికి దక్కకూడదు.. ప్రియురాలిని 10 సార్లు కత్తితో పొడిచి..

బుధవారం, 8 సెప్టెంబరు 2021 (13:52 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిని 10 సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు దక్కనిది మరొకరికి దక్కడానికి వీల్లేదన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ దారుణం జోధ్‌పూర్ రాష్ట్రంలో మంగళవారం జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజ‌స్థాన్ పాలి జిల్లాకు చెందిన ల‌క్షిత‌ అనే విద్యార్థిని న్యాయ విద్య‌ను అభ్య‌సిస్తోంది. నాగౌర్ జిల్లాలో బ‌ట్ట‌ల వ్యాపారం చేస్తూ జీవ‌నం కొన‌సాగిస్తున్న హేమంత్‌ అనే యువకుడితో ల‌క్షిత‌కు ప‌రిచ‌యం ఏర్పడింది. 
 
ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా ఐదేళ్ళపాటు ల‌క్షిత‌, హేమంత్‌లో ప్రేమలో ఉన్నారు.కానీ ల‌క్షిత‌కు ఏడు రోజుల క్రితం మ‌రో యువ‌కుడితో నిశ్చితార్ధం జ‌రిగింది. త‌న ప్రియురాలికి మ‌రొక‌రితో వివాహం జ‌రుగుతంద‌ని తెలియ‌డంతో హేమంత్ జీర్ణించుకోలేకపోయాడు.
 
ఆ వెంటనే సోమ‌వారం రాత్రి ల‌క్షిత‌ను జోధ్‌పూర్‌లోని ఓ హోట‌ల్‌కు హేమంత్ పిలిపించాడు. ఆ రోజు రాత్రి ఇరువురి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. త‌న‌కు ద‌క్క‌ని ల‌క్షిత వేరే వారికి ద‌క్కొద్ద‌నే ఉద్దేశంతో.. ఆమెపై క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశాడు. ఆమె శ‌రీరంపై 10 చోట్ల క‌త్తితో పొడిచాడు. 
 
ఆ త‌ర్వాత తాను కూడా బ‌య‌ట‌కు వెళ్లి.. స‌మీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. హేమంత్ శ‌రీరంపై నుంచి రైలు దూసుకెళ్ల‌డంతో.. శ‌రీరం రెండు ముక్క‌లైంది. ల‌క్షిత‌, హేమంత్ మృత‌దేహాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు