ప్రభుత్వాసుపత్రి మంచంపైన ఆశా వర్కర్‌తో రాసలీల, సస్పెన్షన్ వేటు

గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:36 IST)
కర్ణాటకలో ప్రజల ప్రతినిధుల వరుస లైంగిక కుంభకోణ వీడియోలు బయటకు రావడంతో, ప్రజలు ఆ రాజకీయ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహోలి ఓ యువతితో చేసిన లైంగిక కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
 
అదలావుండగానే తాజాగా ఒక రాజకీయ నాయకుడు- ఆశా కార్యకర్త వీడియో వెలుగులోకి రావడంతో కర్ణాటక ప్రజలు షాక్ అయ్యారు. ఆశా కార్యకర్త, రాజకీయ నాయకుడు ప్రభుత్వ ఆసుపత్రి మంచం మీద పడుకుని ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో సిసిటివి కెమెరాలు ఉండటం వారు మరచిపోయారు.
 
ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ఆశా కార్యకర్తపై సస్పెన్షన్ వేటు వేసినట్లు కర్ణాటక ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు