నెల వేతనం రూ.15 వేలు.. రూ.34 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు - ఐటీ శాఖ వింత చర్య!!

ఠాగూర్

బుధవారం, 2 ఏప్రియల్ 2025 (13:18 IST)
నెలకు కేవలం 15 వేల రూపాయలను సంపాదించే ఓ పారిశుద్ధ్య కార్మికుడుకి ఆదాయపన్ను శాఖ అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. ఏకంగా రూ.34 కోట్ల జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను స్వీకరించిన ఆ కార్మికుడు ఏం చేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాకు చెందిన కరణ్ కుమార్ అనే వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేస్తున్నాడు. అయితే, అతడికి ఆదాయపన్ను విభాగం అధికారుల నుంచి నోటీసులు అందాయి. కానీ, వాటిలో ఏముందో అతడికి అర్థంకాకపోవడంతో విద్యావంతులను అడిగి అసలు విషయం తెలుసుకుని ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించాడు. 
 
2019-20లో కరణ్ రూ.34 కోట్ల ఆదాయాన్ని అర్జించాడు. ఆ యేడాదికి ఎలాంటి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు" అని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ, కరణ్ కుమార్ మాత్రం ఆగ్రాలోని ఖైర్‌లో ఉన్న ఎస్.బి.ఐ శాఖలో పారిశుద్ధ్యం కార్మికుడుగా పనిచేస్తున్నాడు. తన జీతం నెలకు రూ.15 వేలు మాత్రమేనని వెల్లడించారు. అతని పాన్ కార్డు వివరాలు దుర్వినియోగం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఇటీవల అలీగఢ్‌కు చెందిన జ్యూస్ సెంటర్ వ్యాపారికి రూ.7.5 కోట్లు చెల్లించాలని నోటీసులు అందిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు