ఒకటిరెండుసార్లు కాదు... ఏకంగా 25 సార్లు చెప్పుతో కొట్టారు. ఈ విషయం ఆయనగారే మీడియాకు కూడా ఎలాంటి సిగ్గూఎగ్గూ లేకుండా చెప్పేశారు. ఎయిరిండియా అధికారి తన పట్ల దురుసుగా ప్రవర్తించారనీ, అందువల్లనే అతడిని చెప్పుతో కొట్టినట్లు సమర్థించుకున్నారు. అంతేకాదు... అవతలి వ్యక్తి ఏదిబడితే అది మాట్లాడితే మౌనంగా ఉండటానికి తనేమీ భాజపా ఎంపీని కాదనీ, శివసనే ఎంపీనంటూ హూంకరించారు. కాగా గైక్వాడ్ దాడిపై ఎయిర్ ఇండియా సిబ్బంది ఆందోళనకు దిగారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.