అనకూడదుగానీ.. వెంకయ్య బుద్ధిలేనిపని చేశారు : సీతారాం ఏచూరీ

మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (09:09 IST)
రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అభిశంసన తీర్మానాన్ని గుడ్డిగా తిరస్కరించారంటూ ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో వెంకయ్య బుద్ధి లేని పని చేశారంటూ విమర్శించారు. 'గౌరవ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ను ఇలా అనకూడదు. కానీ, తప్పడం లేదు' అని వ్యాఖ్యానించారు.
 
ఇదే అంశంపై సోమవారమిక్కడ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని తిరస్కరిస్తూ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉభయసభల ప్రిసైడింగ్‌ అధికారులకు లేదని తేల్చిచెప్పారు. ఉపరాష్ట్రపతి వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు తీర్మానాన్ని ప్రతిపాదించిన సభ్యులకు ఉందని స్పష్టంచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు