శ్యాంసంగ్, వన్ఫ్లస్, ఆపిల్, షామి, వైవోలున్నాయి. వన్ఫ్లస్ రికార్డుస్థాయిలో రూ.700 కోట్ల అమ్మకాలు జరిపితే శ్యాంసంగ్ అమ్మకాలు ఏకంగా ఐదు రెట్లు పెరిగాయి. శ్యాంసంగ్కు చెందిన ఎం సిరీస్తో పాటు శ్యాం సంగ్ ఏ సిరీస్, శ్యాంసంగ్ నోట్ 9 ఫోన్లకు మంచి డిమాండ్ లభిం చింది.
ఒక వారంలోనే తమ ప్లాట్ఫాంపై 76 మిలియన్ యూజర్లు విచ్చేశారని పేర్కొంది. ఈ ఏడాది దీపావళి అమ్మకాల్లో రికార్డు స్థాయిలో ఆర్డర్లు దక్కాయని తెలి పింది. స్నాప్డీల్కు వచ్చిన ప్రతి పది ఆర్డర్లలో తొమ్మిది ఆర్డర్లు నాన్ మెట్రోనగరాల నుంచి ఉదాహర ణకు విజయవాడ, నాగపూర్, సూరత్, చండీ గఢ్, పానాజీ, జంషెడ్పూర్, షివ్లూ, గువా హతిల నుంచి వచ్చినట్లు స్నాప్డీల్ ఒక ప్రక టనలో వెల్లడించింది.
దక్షిణాదిన ఖమ్మం, హసన్, మిర్యాల గూడ, భీమవరం, పశ్చమ భారత్లో సతారా, ఆనంద్, బరూచ్.. పాలీ, ఉత్తర భార తంలో మాలేర్కోట్లా, రూర్కీ, జాన్సీ మరియు హరిద్వార్, తూర్పున హజారీబాగ్, రాణిగంజ్, పారాదీప్, ఈశాన్య ప్రాంతాల్లో తేజ్పూర్, ఇటాన గర్, మాజు లీలున్నట్లు స్నాప్ డీల్ వివరించింది.
గత వారం అమెజాన్ ఇం డియా ఒక ప్రకట నలో ఈ పండుగ సీజన్లో గత ఏడాదితో పోల్చుకుంటే అమ్మ కాలు 3 రెట్లు పెరిగా యని తెలిపింది. ముఖ్యంగా నాన్ మెట్రో కస్టమర్ల నుంచి ఆర్డర్లు ఎక్కువగా వచ్చా యని.. సుమారు 15వేల పిన్కోడ్ల నుంచి కస్ట మర్లు తమ ప్రైమ్ ప్రో గ్రాంలో చేరారని, గతేడాదితో పోల్చు కుంటే ఈ ఏడాది చిన్న పట్టణాల నుంచి 69 శాతం మంది ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టారని తెలిపింది.