భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు ప్రతికగా తాము ఆపరేషన్ బ్యూనాన్ ఉన్ మర్సూస్ నిర్వహించామని, అందులో విజయం సాధించామని చాటుకునేందుకు పాకిస్థాన్ ఆపసోపాలు పడుతుంది. ఇటీవల జరిగిన ఓ ఉన్నతస్థాయి కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో ప్రధానికి ఆర్మీ చీఫ్ ఓ జ్ఞాపికను బహుకరించారు. అందులో ఉన్న పెయింటింగ్ సైనిక విన్యాసాలకు సంబంధించిందని ఆరోపణలు వచ్చాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ కుటిల నీతిని ఎండగట్టేందుకు భారత ఎంపీల బృందాలు విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, కువైట్లో పర్యటిస్తున్న ఎంపీల బృందానికి అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వం వహించారు. ఇందులో పాకిస్థాన్పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్టుడిప్ జోకర్స్ అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు.