మూడేళ్లుగా దర్యాప్తు పూర్తి చేయకుండా నిందితులను ఎంత కాలం జైల్లో ఉంచుతారని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓఎంసీ కేసులో గాలి జనార్థన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నిందితుల శిక్ష ఖరారు కాకుండానే దర్యాప్తు దశలో ఇలా జైల్లో ఉంచడం న్యాయ సమ్మతం కాదని వ్యాఖ్యానించింది. గాలి జనార్థన్ రెడ్డి అన్ని కేసులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించింది.