పాకిస్తాన్ గాజు మేడలో ఉన్నామన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖామంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమనీ, అది ఎప్పటికీ భారతదేశానిదేనని స్పష్టం చేశారు. న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితిలో ఆమె మాట్లాడుతూ, పాకిస్తాన్ దేశంపై మండిపడ్డారు. భారతదేశం స్నేహ హస్తం అందిస్తుంటే పాకిస్తాన్ ఎప్పుడూ తన కుటిలబుద్ధిని చూపించుకుంటూనే ఉందన్నారు.
ఉగ్రవాదంపై మాట్లాడుతూ... ప్రపంచంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది ఎవరు? వారికి ఆయుధాలను అందిస్తున్నది ఎవరు? ఇవన్నీ కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదులను ఏరిపారేయడంలో ప్రపంచం మొత్తం ఒకతాటిపైకి రావాలన్నారు. ఏ దేశమైనా ఉగ్రవాదులను నిర్మూలించేందుకు వ్యతిరేకిస్తే ఆ దేశం ఉగ్రదేశంగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. భారతదేశం ఎప్పటికీ శాంతిని కోరుకుంటుందని చెప్పారు.