ప్రభుత్వ ఉద్యోగం వస్తే ప్రాణాలు తీసుకున్నాడు.. అది మొక్కుబడి అట!

ఆదివారం, 1 నవంబరు 2020 (10:45 IST)
కొందరు ప్రభుత్వ ఉద్యోగం వస్తే మొక్కులు చెల్లించుకుంటామని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అంటే ఎగిరి గంతులేస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఏకంగా ప్రాణాలు తీసుకున్నాడు ఓ వ్యక్తి. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఏకంగా ప్రాణాలను అర్పించాడు. కన్యాకుమారికి చెందిన 32 ఏళ్ల నవీన్ అనే వ్యక్తి తనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే తన జీవితాన్ని త్యాగం చేస్తాను అంటూ దేవుడికి మొక్కుకున్నాడు. 
 
కొన్ని రోజుల వ్యవధిలోనే ముంబైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించాడు నవీన్. ఇక ఎంతో సంతోష పడి ఉద్యోగంలో చేరి 15 రోజుల పాటు విధులు నిర్వహించి ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భగవంతుడికి ఇచ్చిన ముక్కు చెల్లించుకునేందుకు ఆత్మహత్య చేసుకున్నాను అంటూ సూసైడ్ నోట్లో కూడా పేర్కొన్నాడు సదరు వ్యక్తి. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు