శనివారం సాయంత్రం కరూర్ లోని వేలుసామిపురంలో జరిగిన ఈ బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇరుకైన దారుల్లో తొక్కిసలాట జరిగి ఊపిరాడక, కాళ్ల కిందపడి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 9 మంది చిన్నారులు, అధికశాతం మహిళలు ఉన్నారు.
మరో 60 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్తో విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు.