అఖిలపక్ష సమావేశంలో పాల్గొనం: మమత ప్రకటన

ఆదివారం, 23 నవంబరు 2014 (12:41 IST)
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదివారం జరిగే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనబోమని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ప్రకటించారు. 
 
బీజేపీ తమపై కక్ష గట్టిందని మమత ఆరోపించిన విషయం విదితమే. బ్లాక్‌మనీని వెనక్కి రప్పించకుంటే మోడీ గద్దె దిగాలని మమత డీమాండ్ చేసిన విషయం తెలిసిందే.
 

వెబ్దునియా పై చదవండి