యువతితో కలిసి పారిపోయిన అంకుల్.. చివరికి ఏమైందంటే?

శుక్రవారం, 7 జనవరి 2022 (17:32 IST)
యువతి మోజులో పడి ఓ అంకుల్ పాడు పని చేశాడు. తన భార్య, పిల్లలను కాదని ఇంటి నుండి పారిపోయాడు. దీంతో తనకు న్యాయం చేయాలని భార్య పోలీసులను ఆశ్రయించడం తమిళనాడులో కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. సేలంలోని పొన్నమ్మపేట్ ప్రాంతానికి చెందిన మోహనప్రియ, రమేష్(42) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నాయి. రమేష్ ఓ జ్యువెలరీ స్టోర్ లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అదే షాపులో పనిచేస్తున్న 22 ఏళ్ల యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమ మారింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి పారిపోయారు. 
 
తన భర్త మరో యువతితో వెళ్లిపోయిన సంగతి తెలిసిన మోహన ప్రియ పోలీసులను ఆశ్రయించింది. ఇదిలా ఉంటే తనపై పెట్టిన కేసు వాపస్ తీసుకోకపోతే చంపేస్తానని తన భర్త బెదిరిస్తున్నాడని రమేష్ భార్య చెప్పింది. ఎప్పటికైనా తనను తన పిల్లలను చంపేస్తాడని అతడి బారి నుండి తమనకు కాపాడాలని మోహన ప్రియ కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు