ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వ వైఖరి, కార్యాచరణ పద్ధతిని మార్చిందని రాజ్నాథ్ సింగ్ గుర్తుచేశారు. దీనికి తాజా, ఉత్తమ ఉదాహరణ 'ఆపరేషన్ సింధూర్' అని, ఇది భారతదేశ చరిత్రలోనే ఉగ్రవాదంపై జరిగిన అతిపెద్ద చర్య అని ఆయన అభివర్ణించారు.
పాకిస్థాన్ను ఉగ్రవాదానికి తండ్రి (ఫాదర్ ఆఫ్ టెర్రరిజం)గా అభివర్ణించిన రాజ్నాథ్, ఆ దేశం ఎప్పుడూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, వారికి శిక్షణ ఇస్తూ, అనేక రకాలుగా తన గడ్డపై సహాయం అందిస్తోందన్నారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మూలించాలంటే, "ఈ రోజు ప్రపంచంలో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చి, ఆశ్రయం కల్పిస్తున్న దేశాలను బహిర్గతం చేయడం కూడా చాలా ముఖ్యం" అని ఆయన నొక్కి చెప్పారు.