వధువును వివస్త్ర చేశారు.. చర్మ వ్యాధి వుందని.. పోలీస్ స్టేషన్లో...?

సోమవారం, 15 మే 2017 (10:44 IST)
పెళ్ళి ఘడియలు సమీపిస్తున్నాయి. అయితే నవ వధువుకు తీవ్ర అవమానం జరిగింది. వరుడి తరపు బంధువులైన మహిళలు ఆమె వస్త్రాలన్నీ తీసేసి శరీరాన్ని తనిఖీలు చేశారు. వధువుకు చర్మ వ్యాధి ఉందని ఆరోపణలు రావడంతో.. నవ వధువును వివస్త్రను చేసి.. తనిఖీలు చేశారు. ఈ ఘటన యూపీలో మహోబా జిల్లాలో చోటుచేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. జై హింద్‌ అనే వ్యక్తికి తీజా అనే యువతికి వివాహం నిశ్చయించారు. సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి పెళ్లికూతురు ల్యుకోడర్మా అనే చర్మ వ్యాధితో బాధపడుతుందని, ఈ విషయాన్ని దాచారని వదంతులొచ్చాయ్. దీనిపై వరుడి కుటుంబ సభ్యులు రచ్చ చేశారు. దాదాపు పెళ్లిని ఆపేంత పనిచేశారు.  అయితే, పెళ్లి కూతురు తండ్రి పోలీసులను పిలవడంతో నేరుగా ఇరు వర్గాలను స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు అక్కడే ఓ స్టేషన్‌ గదిలోకి అబ్బాయి తరుపు మహిళలు కొందరిని పంపించి అక్కడే పెళ్లి కూతురు వస్త్రాలు తీయించి తనిఖీలు చేయించారు. 
 
కానీ అలాంటి చర్మ వ్యాధి ఏదీ లేదని నిర్ధారించుకున్నాక పెళ్లిపీటలు ఎక్కించారు. ఈ సందర్భంగా వరుడు వధువుకు క్షమాపణలు చెప్పినా.. అప్పటికే ఆ అమ్మాయికి జరిగిన అవమానం జరిగింది.

వెబ్దునియా పై చదవండి