మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బెంగళూరులో కొత్త సంవత్సరాది రాత్రి ఒంటరిగా నడిచి వెళ్తున్న యువతిని ఆ రోడ్డున వెళ్ళే ఇద్దరు పోకిరీలు లైంగికంగా వేధించిన ఘటన సంచలనమైన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్లోనూ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపై నడిచి వెళ్తుంటే.. 14 మంది పోకిరీగాళ్లు వారిని చుట్టుముట్టారు. వీరిలో ఒకమ్మాయిని లక్ష్యంగా చేసుకుని లైంగికంగా వేధించారు. అంతటితో ఆగకుండా వీడియో తీసి మరీ నెట్లో అప్లోడ్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. యూపీలోని రాంపూర్ జిల్లా తండా పోలీస్ స్టేషన్ పరిధి సన్నని కాలిబాటలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలిబాటన నడుచుకుంటూ వెళ్ళిన ఇద్దరమ్మాయిలపై 14 మంది పోకిరీగాళ్లు ఓవరాక్షన్ చేశారు. ఒకమ్మాయినే లక్ష్యం చేసుకుని తాకరాని చోట్ల తాకుతూ, తడుముతూ, పట్టుకుని లాగేస్తూ, తోసేస్తూ, అసభ్యకరమైన భాషలో మాట్లాడుతూ దారుణంగా వ్యవహరించారు.