నా చావుకు నా భార్య - ఆమె ప్రియుడే కారణం...

గురువారం, 21 అక్టోబరు 2021 (15:08 IST)
కట్టుకున్న భార్య, ఆమె ప్రియుడు వేధింపులను భరించలేని ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య మ‌రొక‌రితో సంబంధం పెట్టుకోవ‌డం జీర్ణించుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోమతి నగర్‌లో జరిగింది. 
 
ఆల‌స్యంగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, గోమ‌తి న‌గ‌ర్‌కు చెందిన నిఖిల్‌కు 2012లో వివాహం కాగా, ఒక కుమార్తె ఉంది. నిఖిల్ కిరాణా దుకాణం నిర్వ‌హిస్తుండ‌గా, భార్య ఓ ఎన్జీవో సంస్థ‌లో ప‌ని చేస్తోంది.
 
అయితే భార్య త‌న స‌హోద్యోగితో గ‌త కొంత‌కాలం నుంచి వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తోంది. అదేసమయంలో ఆమె కుటుంబాన్ని ప‌ట్టించుకోవ‌డం మానేసింది. స‌హోద్యోగితో స‌న్నిహితంగా ఉండ‌టం మానుకోవాల‌ని భార్య‌ను నిఖిల్ హెచ్చ‌రించాడు. 
 
అయిన‌ప్ప‌టికీ ఆమె ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాలేదు. మంగ‌ళ‌వారం రాత్రి భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. త‌న అక్ర‌మ సంబంధానికి అడ్డు రావొద్ద‌ని భార్య భ‌ర్త నిఖిల్‌కు తెగేసి చెప్పింది. లేదంటే అంతు చూస్తాన‌ని బెదిరించింది.
 
దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన నిఖిల్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఘ‌ట‌నాస్థ‌లిలో నాలుగు పేజీల లేఖ ల‌భ్య‌మైంది. త‌న చావుకు భార్య‌, ఆమె ప్రియుడే కార‌ణ‌మ‌ని, వారిద్ద‌రిని క‌ఠినంగా శిక్షించాల‌ని నిఖిల్ త‌న సూసైడ్ నోట్‌లో పేర్కొన్న‌ట్లు పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు