మహిళపై గ్యాంగ్ రేప్... గుడిలో సజీవదహనం

ఆదివారం, 15 జులై 2018 (10:49 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలో సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే సంఘటన ఒకటి జరిగింది. 35 ఏళ్ల మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను ఓ ఆలయంలోకి తీసుకెళ్లి యజ్ఞశాలతో సజీవదహనం చేశారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా రాజ్‌పుర పోలీసు స్టేషన్ సమీపంలోని ఓ గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
మృతురాలు గజియాబాద్‌లో కూలీగా పని చేసుకుంటా భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమె శనివారం ఒంటరిగా ఇంట్లో పడుకునివుండగా, లోపలకు చొరబడిన కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత సమీపంలోని ఆలయం వద్దకు తీసుకెళ్లి, యజ్ఞశాలలో అత్యంత పాశవికంగా నిప్పుపెట్టి సజీవదహనం చేశారు. ఈ ఘటనపై మృతురాలి భర్త కన్నీరుమున్నీరయ్యాడు.
 
'తెల్లవారుజామున 2.30 గంటలకు నా భార్య ఒంటరిగా నిద్రిస్తుండటం చూసిన దుండగులు నా ఇంట్లో చొరబడి ఆమెపై అత్యాచారం చేశారు. ఆ విషయాన్ని నా భార్య తన కజిన్‌కు ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసే లోపే అత్యాచారానికి ఒడికట్టిన దుండగులు మళ్లీ ఇంట్లోకి చొరబడి నా భార్యను ఈడ్చుకుంటూ సమీపంలోని ఆలయం వద్దకు తీసుకువెళ్లారు. అక్కడి యజ్ఞశాల వద్ద ఆమెకు నిప్పుపెట్టారు' అంటూ బోరున విలపిస్తూ వెల్లడించారు. 
 
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి... ఆరామ్ సింగ్, మహావీర్, చరణ్ సింగ్, గుల్లు, కుమార్‌పాల్‌ అనే నిందితులను గుర్తించినట్టు తెలిపారు. పరారీలో ఉన్న వీరికోసం గాలిస్తున్టన్టు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు