డెహ్రాడూన్ జిల్లాలో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి

ఆదివారం, 31 అక్టోబరు 2021 (12:39 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ జిల్లాలోని వికాస్‌నగర్‌ వద్ద ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఈ వాహనంలో ప్రయాణిస్తున్న 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ప్రమాద వార్త తెలియగానే పోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది. ఆదివారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు