ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొత్త వెర్షన్ వందే భారత్ రైళ్లు పరుగుపెడుతున్నాయి. ఇపుడు కొత్తగా వందే భారత్ 4.0 వెర్షన్ను అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. సీఐఐ ఇంటర్నేషనల్ రైల్ కాన్ఫరెన్స్లో ఈ అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైళ్ల జాబితాలో తర్వాత వర్షన్ రానుందని, ఇందుకోసం వందేభారత్ 4.0 (Vande Bharat 4.0)ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రైళ్ల ఆధునిక సాంకేతికత విషయంలో దేశాన్ని గ్లోబల్ సప్లయిర్గా మార్చేదిశగా ఇది కీలక అడుగు కానుందని వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధిపై బలంగా దృష్టి సారించిందని వెల్లడించారు. 11 ఏళ్లలో 35,000 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. జపాన్ బుల్లెట్ రైల్ నెట్వర్క్ మాదిరిగానే హైస్పీడ్ ప్యాసింజర్ రైల్ కారిడార్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు. గరిష్ఠంగా గంటకు 350 కి.మీ వేగంతో రైలు ప్రయాణించేలా వాటి డిజైన్ ఉంటుందని తెలిపారు.