ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఠాగూర్

గురువారం, 12 జూన్ 2025 (22:23 IST)
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 241 మంది ప్రాణాలు కోల్పోగా, కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, ఈ విమానం రన్ఐ వే పై నుంచి టేకాఫ్ అయిన తర్వాత విమానం ఇంజిన్ శక్తిని కోల్పోవడంతో ఫ్లైట్ కిందకు కూలిపోయి పేలిపోయిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
మరోవైపు, ఈ విమాన ప్రమాద బాధితులకు ఎయిరిండియా యాజమాన్య సంస్థ టాటా గ్రూపు భారీ సహాయాన్ని ప్రకటించింది. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి టాటా గ్రూపు తరపున రూ.కోటి అందజేస్తాం. గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా మేమే భరిస్తాం. వారి సంరక్షణ బాధ్యత కూడా మాదే. అంతేకాకుండా, బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి మా వంతుగా తోడ్పాటు అందిస్తాం అని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఓ ప్రకటనలో తెలిపారు. 

 

CCTV of ahmedabad plane crash #planecrash #Ahmedabad #AhmedabadPlaneCrash #AirIndia #CCTV #Boeing787 #Boeing787Dreamliner #Boeing pic.twitter.com/aTfzEBopZB

— Sourabh Khandelwal (@sourabhskhandel) June 12, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు