ముఖ్యంగా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అడుగు పెట్టిన ప్రతి చోటా ఆ పార్టీ ఎలాంటి దుస్థితి అనుభవిస్తుందో కూడా ఈ ఎన్నికలు కళ్లకు కట్టాయి.
కాంగ్రెస్కు ఇంకా జీర్ణించుకోలేని విషయం ఏమిటంటే.. తమ పార్టీ నేత, యువరాజు రాహుల్గాంధీ ప్రచారం నిర్వహించిన నక్సల్బరీ, గోల్పోఖర్ స్థానాలు రెండింట్లోనూ ఆ పార్టీకి డిపాజిట్లు దక్కలేదు. విచిత్రమేమిటంటే నక్సల్బరీ స్థానం పదేళ్లుగా కాంగ్రెస్ దగ్గరే ఉంది. అయితే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ మాలాకర్ మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఆయనకు కేవలం 9 శాతం ఓట్లు వచ్చాయి.
గోల్పోఖర్ కాంగ్రెస్ అభ్యర్థి కూడా 12 శాతం ఓట్లతో మూడోస్థానానికి పరిమితమయ్యారు. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ 90 స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకున్నాయి. ఇదే పరిస్థితి ఫలితాలు వెలువడిన మిగిలిన రాష్ట్రాల్లో కూడా కనిపిస్తోంది. కొంత గుడ్డిలో మెల్లగా తమిళనాడులో ఆ పరిస్థితి ఫర్వాలేదు. దీనికి కారణం... బలమైన డీఎంకే వంటి మిత్రపక్షం ఉండటం కలిసివస్తుంది.